వికారాబాద్ : జిల్లాలోని పూడూర్ మండలం రామగుండం అడవిలో కనుక లొద్ది ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు ఓ దుప్పి బలైంది. గతంలో ఇదే ప్రాంతంలో దుప్పి అనుకొని వేటగాళ్లు ఆవును వేటాడారు. పశువుల కాపరి గమనించి గ్రామస్తులకు చెప్పాడు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతోనే వేటగాళ్ల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిఘా పెంచి ఇలాంటి నేరాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.