హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : డీఈఈ సెట్ వెబ్ కౌన్సెలింగ్ ఈ నెల 22 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్టు కన్వీనర్ శ్రీనివాసాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాంకులు వచ్చిన విద్యార్థులు తమ జిల్లాల్లోని డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. వివరాలకు http://deecet.cdse.telangana.gov.inను సంప్రదించాలని కోరారు.