నందిపేట్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ పాతూర్లోని ఓంకార రూపిణీ దుర్గాదేవి మండపాన్ని కోటీ రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. సోమవారం దుర్గాదేవీని లక్ష్మీదేవీ రూపంగా కొలుస్తూ నోట్లతో అలంకరించారు. భక్తులు పోగుచేసిన నోట్లతో మండపం నిండా అలంకరించారు. రూ. పది నోటు నుంచి రెండు వేల నోటు వరకూ ఈ అలంకరణలో ఉపయోగించారు. నిర్వాహకులు ప్రతి ఏడాది కొంత మొత్తాన్ని పెంచుతూ కరెన్సీతో అలంకరిస్తు వస్తున్నారు.
ప్రస్తుతం కోటీ వరకు కరెన్సీని పెంచి అలంకరించడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కాగా నిజామాబాద్ జిల్లాలో దుర్గా నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు అమ్మవారిని అన్నపూర్ణ దేవీగా, మరికొందరు మహాలక్ష్మీ దేవీగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.