హైదరాబాద్ : ప్రపంచ అగ్రగామి వజ్రాల కంపెనీ డి బీర్స్ మూడు రోజుల పాటు జరిగిన10వ వార్షిక ఫోరమ్ లో పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. డి బీర్స్ ఫరెవర్ మార్క్ రీబ్రాండ్, ఫరెవర్ మార్క్ అవంతి కలెక్షన్, ఆరిజిన్ ప్రోగ్రామ్ నూతన కోడ్, నేషనల్ జియోగ్రాఫిక్ తో నూతన భాగస్వామ్యం వంటివి ఇందులో ఉన్నాయి. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది దేశవ్యాప్తంగా 8 లక్షల మంది భాగస్వాములు, వజ్రాల నిపుణులు, తయారీదారులు, కొనుగోలుదారులను చేరుకుంది.
ఈ ఏడాది థీమ్ ‘మేక్ లైఫ్ బ్రిలియంట్’ అనేది తన కొనుగోలుదారులు, సమాజం జీవితాన్ని బ్రిలియంట్ చేయడంపై డి బీర్స్ కు గల విశ్వాసాన్ని ప్రతిఫలిస్తుంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఫరెవర్ మార్క్ ను డి బీర్స్ ఫరెవర్ మార్క్ గా రీబ్రాండ్ చేశారు. అంతేగాకుండా డి బీర్స్ ఫరెవర్ మార్క్ తన తాజా కలె క్షన్ ఫరెవర్ మార్క్ అవంతి ఫైన్ జ్యుయలరీ కలెక్ష న్ ని కూడా ఆవిష్కరించింది. 18కె ఎల్లో, వైట్, రోజ్ గోల్డ్ లో సర్క్యులర్ డిజైన్లలో ఈ కలెక్షన్ లభ్యమవుతుంది.
ఈ కార్యక్రమం సందర్భంగా రిటైల్ లో అధునాతన సాంకేతికతలను తన భాగస్వాములకు సంస్థ ప్రదర్శించింది. అంతేగాకుం డా సెప్టెంబర్ 10న ఫరెవర్ మార్క్ అవంతి ఫైన్ జ్యుయలరీ కలెక్షన్ ను భారతదేశంలో ప్రారంభిస్తున్న సందర్భంగా కొనుగో లుదారుల కోసం తన వర్చువల్ స్టోర్ ను కూడా ప్రదర్శించింది. నూతన విశ్వసనీయ సోర్స్ ప్రోగ్రామ్ కింద కోడ్ ఆఫ్ ఆరిజన్ ను కూడా సంస్థ పరిచయం చేసింది. దీని ప్రకారం ప్రతీ ఆభరణం కూడా కోడ్ ఆఫ్ ఆరిజిన్ సర్టిఫికెట్ తో లభిస్తుంది.
బోట్స్ వానా, కెనడా, నమీబియా లేదా దక్షిణాఫ్రికాలలో డి బీర్స్ కనుగొన్న వజ్రాలకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది. తాము కొనుగోలు చేసిన వజ్రం మూలం ఎక్కడో కొనుగోలుదారులు తెలుసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ప్ర స్తుతం ఈ కార్యక్రమం పరిమిత సంఖ్యలో భాగస్వాముల వద్దనే లభిస్తోంది. 2022లో ఇది మరింత విస్తృతం కానుంది. ఈ సందర్భంగా డి బీర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ , సచిన్ జైన్ మాట్లాడుతూ నేషనల్ జియోగ్రఫీతో సంస్థ భాగస్వామ్యం గురించి వివరించారు.