వనపర్తి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తకోట మండలం రాణి పేట స్టేజీ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో డీసీఎం డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి కీరదోసకాయ లోడుతో హైదరాబాద్ వస్తున్న డీసీఎం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ బాలకృష్ణ (40) క్యాబిన్లో ఇరుక్కుపోయి మృతి చెందాడని ఎస్సై నాగ శేఖర్ రెడ్డి తెలిపారు. మృతుడు సిద్దిపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.