శంషాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పా జంక్షన్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ నుంచి గచ్చిబౌలికి స్టీల్ లోడ్తో వెళ్తున్న లారీని ఔటర్ రింగ్ రోడ్డుపై అప్పా జంక్షన్ సమీపంలో జడ్చర్ల నుంచి జహీరాబాద్కు కీర లోడ్తో వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుమ్మడిదల మండలం లచ్చిరెడ్డి గూడ గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్ కమ్ ఓనర్ అరుణ్చారి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.