రంగారెడ్డి, సెప్టెంబర్ 1, (నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు టర్నోవర్ రూ.1500 కోట్లకు చేరిందని డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి తెలిపారు. గురువారం నాంపల్లిలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం జరిగింది. పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, గృహరుణాలు, కర్షక మిత్ర రుణాలు, రుణాల వసూలుపై చర్చించారు.ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే బ్యాంకు టర్నోవర్ రూ.100 కోట్లకు పెరిగినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా బంగారంపై రుణాలు రూ.200 కోట్లకు పెరిగిందన్నారు. కాగా, ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన నాబార్డు ప్రతినిధులు హైదరాబాద్ కేంద్ర సహకార బ్యాంకు అందిస్తున్న సేవలను నాబార్డు ప్రశంసించింది. ఈ సమావేశానికి డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, బ్యాంకు డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, విఠల్ రెడ్డి, సతీశ్, అంజిరెడ్డి, చంద్రశేఖర్, ప్రవీణ్ రెడ్డి, సీఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.