బీర్కూర్/ కామారెడ్డి : తన బిడ్డల పెండ్లి కోసం ఆ తండ్రి ఎంతో కష్టపడ్డాడు. దేశం కాని దేశం వెళ్లి పైసా పైసా కూడబెట్టి బిడ్డ పెండ్లి ఘనంగా చేద్దామని ఏర్పాట్లు చేసుకున్నాడు. బిడ్డను అత్తరింటికి సగర్వంగా సాగనంపి తన బరువును తీర్చాలకున్నాడు. కానీ, విధి మరోలా తలిచింది. ఎంతో సందడిగా వివాహం జరగాల్సిన ఆ ఇంట్లో విషాదం నిండింది. కూతురి పెండ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన ఇంటి పెద్ద అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సాయంత్రం కూతురు వివాహం జరగాల్సి ఉండగా ఉదయం తండ్రి మరణించిన సంఘటన జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది.
గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన షేక్ గూడుమియా (50)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఆయన మొదటి కుమార్తె తబస్సుం. ఆమెకు బాన్సువాడ మండలం దేశాయిపేట్కు చెందిన యువకుడితో వివాహం కుదిరింది. వివాహం సోమవారం సాయంత్రం జరగాల్సి ఉంది. కాగా, గత నెల 29వ తేదీన గూడుమియాకు బీపీ ఎక్కువై అస్వస్థకు గురయ్యాడు.
దీంతో ఆయనను బాన్సువాడ ఏరియా దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు.
చికిత్స పొందుతూ ఆయన సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
గూడుమియా ఉపాధి కోసం 14 ఏండ్లు దుబాయ్లో ఉండి రెండేండ్ల క్రితమే వచ్చాడని, కుమార్తె పెండ్లి చేసి మళ్లీ దుబాయ్ వెళ్తానని కుటుంబ సభ్యులకు చెప్పేవాడని గ్రామస్తులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
తల్లిని వదిలేసిన కొడుకులు..అక్కున చేర్చుకున్న పోలీసులు
హరితహారం మొక్కలు ధ్వంసం.. రూ. 5వేల జరిమానా
కీలక అంశాలపై చర్చకు మోదీ సర్కార్ వెనుకంజ!
Tokyo Olympics: చరిత్రలో ఇంతకు మించిన విజయం ఉండదేమో..!
మెడికల్ హబ్గా మారనున్న మహబూబ్నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్