మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని వేమునూరులో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిపత్రాల కోసం తండ్రిని హత్యచేసింది కూతురు (Daughter). వేమునూరుకు చెందిన వెంకన్న, ప్రభావతి (17) తండ్రీ కూతుర్లు. తనకు ఆస్తి పత్రాలు ఇవ్వడంలేదన్న కోపంతో తండ్రి వెంకన్నపై ప్రభావతి కర్రతో దాడిచేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.