సంగారెడ్డి, అక్టోబర్ 4 : చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకొంటారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్థ, అన్యాయ, అసమానత, అహంకారం అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రు ల్లో అమ్మవారిని పూజిస్తే దూరమవుతాయనేది నమ్మకం. విజయదశమి రోజున రాముడు రావణుడి పై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను పెట్టిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి చెట్టుకు పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి, మహిషాసురడనే రాక్షసుడితో తొమ్మిది రాత్రులు యుద్ధ్దం చేసి అతడిని వధించి విజయాన్ని పొందిన సందర్భంలో 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకొంటారు.
మహిషాసురిడిని వధించిన అమ్మవారు
బ్రహ్మదేవుడి వరాలతో గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో భీకరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు.దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషుడి పై వారిలో రగిలిన క్రోదాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది.త్రిమూర్తుల తేజము ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుడి తేజం ముఖముగా, విష్ణు తేజం బహువులుగా, బ్రహ్మతేజం పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పదునేనమిది చేతులను కలిగి ఉంది. దుర్గాదేవికి శివుడు శూలమును, విష్ణు వు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలం, హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు.ఇలా సర్వదేవత ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుడి సైన్యంతో తలబడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుడి తరుపున యుద్ధ్దానికి వచ్చిన ఉదద్రుడు, మహానుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసుడితో తలపడి అమ్మవారు విజయం సాధించింది.
ఆయుధ పూజ
దసరా ఉత్సవాల్లో అతి ముఖ్యమైనది ఆయుధపూజ, విజయదశమికి ముందురోజు వచ్చే మహార్నవమి రోజు, కొందరు అదే రోజున ఈ పూజలు చేస్తారు.ఆయుధ పూజ అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని దుర్గాదేవరి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన వేడుకగా జరుపుకొంటారు.ఆయుధపూజను అస్త్రపూజ అంటా రు. ప్రజలు వారు ఉపయోగించే ఉపకరణాలు, ఆయుధాలు, యంత్రాలు మొదలైన వాటికి సైతం పూజలు చేస్తారు.
శుభాలిచ్చే పాలపిట్ట
దసరా పండుగలో పాలపిట్టకు ఉన్న ప్రాధాన్యం ఎనలేని ది. విజయదశమి రోజు పాలపిట్టను చూస్తే శుభాలు కలుగుతాయని, పాపాలు నాశనమవుతాయంటారు. సర్వత్రా విజయాలు సైతం లభిస్తాయని, విశ్వాసం, పాండవులు, అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనిపించింది.ఆ రోజు నుంచి వారు ఏది చేసినా విజయం సిద్ధించిందని పెద్దలు చెబుతుంటారు.దేశంలోని అనేక ప్రాంతాల్లో పాలపిట్టను శుభసూచకమైన పక్షిగా పరిగణిస్తారు.ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో భక్తిప్రవత్తులతో చూస్తారు.తెలంగాణ పాటు కర్ణాటక, బీహార్, ఒడిశా రాష్ట్ర పక్షి పాలపిట్టే అంటే ఈ పక్షికి ఉన్న ప్రాధాన్యం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు
జమ్మి చెట్టు
జమ్మిచెట్టుకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లడానికి ముం దు తమ ఆయుధాలను జమ్మి చెట్టు పై దాచారని, తమకు విజయం కలగాలని ఆ చెట్టును పూజించినట్లు చరిత్రద్వారా తెలుస్తున్నది. జమ్మి చెట్టుకు పూజలు చేసే సంప్రదాయం దేశమంతటా ఉంది. ఈ చెట్టును అగ్ని స్వరూపంగా భావిస్తారు.యజ్ఞాల కోసం నిప్పు రాజేసేందుకు శమీ దారువునే ఉపయోగించేవారు.అందుకే దీన్ని అగ్నిగర్భ అంటారు. ఔషధ లక్షణాలు సమృద్ధిగా ఉన్న ఈ చెట్టు తెలంగాణ రాష్ట్ర వృక్షం.సకల కార్యసిద్ధి కోసం, సర్వత్రా విజయ, క్షేమాల కోసం జమ్మి చెట్టును పూజించాలని పెద్దలు చెబుతారు.