హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే పలు దేవాలయాల్లో దర్శనాలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం యంత్రాంగం సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే, స్వామివారికి అర్చకులు నిత్యం పూజలు చేస్తారని చెప్పారు. ఇప్పటికే ఇద్దరు ఆలయ సిబ్బంది, ఓ అర్చకుడు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. అలాగే గ్రామంలో 50కిపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువగా భక్తులు వస్తున్నందున కరోనా వ్యాప్తికి అవకాశం ఉండడంతో భక్తులకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు చెప్పారు.