అమరావతి : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడోరోజు దుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో పంచముఖాలతో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారి సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు విజయవాడకు చేరుకున్నారు.