న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్లో చనిపోయిన రాయిటర్స్ ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీకి అరుదైన గౌరవం లభించింది. ఆయన మృతదేహాన్ని యూనివర్శిటీ క్యాంపస్లో ఖననం చేసేందుకు జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం అనుమతించింది. యూనివర్శిటీ ఉద్యోగులు, వారి కుటుంబీకుల మృతదేహాలను మాత్రమే ఖననం చేసే ఆచారాన్ని కాదని, డానిష్ సిద్ధిఖీ మృతదేహాన్ని క్యాంపస్ ఆవరణలో ఖననం చేసేందుకు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ అసాధారణ కేసుగా పరిగణించి అనుమతించారు.
జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన డానిష్ సిద్ధిఖీ (39) రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీలో ఉద్యోగిగా చేరారు. రోహింగ్యా కాందిశీకులు ఎదుర్కొంటున్న బాధలను ఫొటోల రూపంలో ప్రపంచానికి చాటిచెప్పడంతో ఆయనను పులిట్జర్ అవార్డు వరించింది. ఇటీవల కాందహార్లో ఆఫ్ఘాన్ సైనికులు-తాలిబాన్ల మధ్య ఘర్షణను కెమెరాలో బంధించేందుకు వెళ్లి డానిష్ శుక్రవారం చనిపోయాడు. ఆయన కుటుంబాన్ని పరామర్శించిన జామియా మిలియా ఇస్లామియా వీసీ నజ్మా అఖ్తర్.. మంగళవారం సంతాపసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రేరణగా నిలిచేలా ఆయన తీసిన ఫొటోల ప్రదర్శనను కూడా చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
12 వేల మంది అమెరికన్లకు 9 కోట్ల టోకరా, అరెస్ట్
ఈ టీచర్లు జిహదీలను తయారుచేస్తారంట..!
కృత్రిమ మేధస్సుకు మెదడు న్యూరాన్ల మోడల్ సృష్టి
షారుఖ్ఖాన్ చేసిన పనిని బయటపెట్టిన దినేశ్ కార్తీక్
సిద్ధివినాయకుడికి 2 కోట్లతో గుడి కట్టిన క్రిస్టియన్..! ఎందుకంటే..?
ఆఫ్ఘాన్లోకి జిహదీలను పంపారు : పాక్పై ఘనీ ఘాటు వ్యాఖ్య
త్వరలో స్పేస్ మసాలా..! కావాలంటే వీరిని సంప్రదించాలి..
కరోనా ట్రైలరే.. ముందుంది ముసళ్ల పండుగ : రిచర్డ్ సెనెట్
చరిత్రలో ఈరోజు.. భారత స్వాతంత్య్ర చట్టానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..