దుబ్బాక, సెప్టెంబర్ 14 : నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నామకరణం చేసేందుకు తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు ముఖం చాటేయడంపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి.
రఘునందన్రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దుబ్బాకలో ర్యాలీ నిర్వహించి, బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టేందుకు తీర్మానాలు చేశారు. కాగా మిరుదొడ్డి, తొగుట మండలాల్లోనూ రఘునందన్రావు దిష్టిబొమ్మలను దహనం చేశారు.