-టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు
ఉస్మానియా యూనివర్సిటీ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో చేసిన దళిత, గిరిజన ఆత్మగౌరవదీక్ష అట్టర్ ఫ్లాప్ షోగా మారిందని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు.ఎన్నిదొంగదీక్షలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని దుయ్యబట్టారు. అదేవిధంగా బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారాలను కూడా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, వాటిని కూడా నమ్మబోరన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం నిర్వ హించిన విలేకరుల సమావేశంలో తుంగబాలు మాట్లాడుతూ రేవంత్ దీక్షకు ప్రజలనుంచి స్పందన కరువైందని ఎద్దేవా చేశారు. జనసమీకరణకు భారీ ఏర్పాట్లుచేసి, ఒక్కొక్కరికీ నగదు, అన్నం పొట్లం ఇచ్చినా ప్రజలు పట్టించు కోలేదని అన్నారు. వచ్చిన ప్రజలు కనీసం రేవంత్ ప్రసంగం అయ్యే వరకు వేచిచూడకుండా తిరుగుముఖం పట్టారని చెప్పారు.
దీక్షకు ఆయన సొంత పార్టీలోనే ఇతర నాయకులనుంచి మద్దతు కరువైందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామంలో రూ.69 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు దాదాపు 98 శాతం పూర్తయ్యాయని గుర్తు చేశారు. అయినా సీఎం దత్తత గ్రామంలో దీక్ష పెట్టి మసి పూసి మారేడుకాయ చేద్దామనుకుంటే, ప్రజల నుంచి గోబ్యాక్ నినాదాలు, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు ఎదురయ్యాయని అన్నారు. దళితుల అభ్యున్నతికి కోట్ల రూపాయలు వెచ్చించి దళిత వాడలను మేడలుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి ముందుకుసాగుతున్నారని కొని యాడారు. దళిత, గిరిజన విద్యార్థులు, యువకులకు రాజకీయంగా అవకాశాలు కల్పించిన నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు.
పరిస్థితులు చూస్తే పాత నాణేనికి గీతలెక్కువ, ఏమీలేని విస్తరి ఆకుకు ఎగురుడు ఎక్కువ, రేవంత్రెడ్డికి మొరుగుడు ఎక్కువ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. మరోవైపు బీజేపీ నేతలు తమ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచు తోందని మండిపడ్డారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ సామాన్యుడి నడ్డి విరిగి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో గ్యాస్ సిలెండర్పై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపేణా కేవలం రూ.21లను ప్రజలపై మోపు తుండగా, బీజేపీ నాయకులు మాత్రం రూ.291లను ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేస్తున్నారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఒక అబద్ధాన్ని పదిసార్లు చెబితే నిజం పోతుందన్నట్లు, గ్యాస్ పై పన్ను అంశాన్ని ఎమ్మెల్యే రఘనందన్రావు విలేకరుల సమావేశంలో నిస్సిగ్గుగా పునరావృతం చేశారని నిప్పులు చెరిగారు.
రాష్ట్ర పరిధిలోని పన్నులను తగ్గిస్తే ధరలు తగ్గుతాయని చెబుతున్న రఘునందన్రావు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పన్నులు తగ్గించే దమ్ముందా? అని ప్రశ్నించారు. అబద్దాలు ప్రచారం చేయడంలో బ్రాండ్ అంబా సిడర్లుగా రఘునందన్రావు, రేవంత్రెడ్డిలు పోటీ పడుతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, అబద్ధాలు వల్లె వేసినా రాష్ట్రంలో ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటారని అన్నారు. ఏ ఎన్నికలు జరిగినా గులాబీ జెండాకే పట్టం కడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోతి విజయ్, రాష్ట్ర ప్రధాన కార్య దర్శి శిగ వెంకటేష్గౌడ్, చందు, నాయకులు ఎరవండ్ల కృష్ణ, నవీన్, మధు, దశరథ్, శశిపాల్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.