బార్మర్, ఆగస్టు 24: దళిత విద్యార్థిని టీచర్ తీవ్రంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో జరిగింది. 7వ తరగతి చదువుతున్న విద్యార్థి బడిలో నిర్వహించిన టెస్టులో ఒక ప్రశ్నకు సమాధానం రాయలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అశోక్ మాలి అనే టీచర్ బాలుడిని విచక్షణా రహితంగా కొట్టాడు. గోడకు తలను బాదాడు. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు పోలీసులు టీచర్ను అదుపులోకి తీసుకున్నారు. కుండలో నీళ్లు తాగాడన్న కోపంతో ఓ దళిత విద్యార్థిపై టీచర్ దాడి చేయడం తెలిసిందే. తీవ్ర గాయాలపాలై ఆ విద్యార్థి మృతిచెందాడు.