వీణవంక : పేద ప్రజల సంక్షేమం కోసం దళితుల ఆర్థికాభివృద్ధి కోసం దళిత బంధు తీసుకువచ్చి సీఎం కేసీఆర్ దళిత బాంధవుడు అయ్యాడని.. సంక్షేమ పథకాలను పరిగేలంటూ దళిత బంధుకు అడ్డుపడుతున్న ఈటల రాజేందర్ దళిత రాబంధువు అని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు అన్నారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 50 మంది కులపెద్దలు, యువకులు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో బీజేపీ నుండి టీఆర్ఎస్ లో చేరగా వారికి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అణగారిన , పేద ప్రజల ఆర్థికాభివృద్దికి కృషి చేస్తుంటే, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ, నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీ పార్టీలో ఈటల రాజేందర్ చేరి అభివృద్ధిని అడ్డుకుంటున్నాడన్నారు. గ్యాస్ పైన రూ.291 తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తుందని బడా బూటకపు పార్టీలో చేరి ఈటల రాజేందర్ బూటకపు మాటలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు.
అబద్దపు, గ్లోబల్ ప్రచారాలు చేస్తూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని, ఓటమి భయంతో పిచ్చి మాటలు మాట్లాడు తున్నాడని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై రూ.291 వేస్తుందని నిరూపించాలి, లేకుంటే పోటీ నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ సిద్దాంతాలు చెప్పకుండా , చేసిన అభివృద్ధి చెప్పకుండా సొంతడబ్బాను కొట్టుకుంటూ సీఎం కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. హూజూరాబాద్ ప్రజలు నీ ప్రజలు ఎలా అయ్యారో ఆలోచన చేయాలని, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వల్లనే అయ్యారని, అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే హూజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఉంటారని తెలిపారు.
ఈటల రాజేందర్ పదవిలో ఉన్నపుడే అసెంబ్లీలో దళితసాధికారత పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందని నీకు తెలియదా అని, ఇప్పుడు ఎన్నికల కోసమే అని ఎలా చెప్తున్నావు అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ గెలిచినా, ఓడినా టీఆర్ఎస్ పార్టీకి ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని , ముదిరాజ్ల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్రెడ్డి, ఎంపీటీసీ రాధారపు రాంచందర్, నాయకులు ఐలవేన సదానందం, ఐలవేన శ్రీనివాస్, ముదిరాజ్ కులస్థులు పాల్గొన్నారు.