యూపీలో ఘోరం
రాయ్బరేలీ, ఏప్రిల్ 19: పదో తరగతి చదువుతున్న ఓ దళిత బాలుడిని చితకబాది, ఓ యువకుడి కాళ్లు నాకించారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ జిల్లా జగత్పూర్లో ఈ నెల 10న చోటుచేసుకొన్నది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో స్థానిక పోలీసులు బాధ్యులైన 8 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే, దళిత బాలుడిని ఎందుకు కొట్టారన్న దానిపై పోలీసులు వివరాలు వెల్లడించలేదు.