మహబూబ్నగర్ : దళిత బంధు పథకం.. ఎంతోమంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. వ్యాపారమంటే తెలియని వారికి.. ఉపాధి అవకాశాలను చూపుతోంది. దళితులను ఆర్థికంగా బలోపేతం చేస్తోంది.
మహబూబ్నగర్లో దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన 62 మంది లబ్ధిదారులకు రూ. 6,23,70,000 చెక్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ అందజేశారు. మరో 8 మంది లబ్ధిదారులు కలిసి క్రిస్టియన్పల్లిలో సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న శ్రీనివాస ట్రేడర్స్ను కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఇక మరో ఇద్దరికి మారుతీ సుజుకి బ్రిజా కార్లను పంపిణీ చేశారు. అనంతరం ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ ఎదురుగా ఎంవీఆర్ ఆన్లైన్, మీ సేవా సెంటర్ను ప్రారంభించారు.