ధర్మశాల: బౌద్ధ మతగురువు దలైలామా కోవిడ్ టీకా తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న జోనల్ ఆస్పత్రిలో ఆయన ఇవాళ టీకా వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.90 కోట్ల మంది కోవిడ్19 వ్యాక్సిన్ వేసుకున్నారు. శుక్రవారం ఒక్క రోజు సుమారు 10.34 లక్షల మంది టీకా తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనవరి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లు దాటిన వారికి టీకా ఇస్తున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి 7 గంటలకు వరకు 1,90,40,175 వ్యాక్సిన్లు ఇచ్చారు.