Market Capitalisation | ఆర్థిక మాంద్యం భయాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు ఏడు శాతమేనన్న ఫిచ్ అంచనాలు.. డాలర్పై రూపాయి మారకం విలువ బలహీనం, నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు.. తదితర కారణాలతో స్టాక్ మార్కెట్లలో దేశీయ ఇన్వెస్టర్లు రూ.6 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయారు. శుక్రవారం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.285.9 లక్షల కోట్ల నుంచి రూ.279.8 లక్షల కోట్లకు పడిపోయింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1,093.22 పాయింట్ల పతనంతో 59వేల పాయింట్ల దిగువన స్థిర పడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 17,550 మార్క్ దిగువకు పతనమైంది.
గ్లోబల్ మార్కెట్లలో బలహీనతలు దేశీయ స్టాక్ మార్కెట్ల పతనానికి కారణం. నిక్కీ, కోస్పీ, హాంగ్ సెంగ్ వంటి స్టాక్స్ భారీగా పతనం అయ్యాయి. గురువారం రాత్రి యూఎస్ స్టాక్స్ భారీగా పతనం అయ్యాయి. వచ్చేవారం యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచితే, ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించాయి.
ఎన్ఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.48 శాతం, ఇన్ఫోసిస్ 3.89, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ & హెచ్డీఎఫ్సీతోపాటు టీసీఎస్ 3.08, ఐసీఐసీఐ బ్యాంకు 0.93 శాతం నష్టపోయాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్క్రిప్ట్లు భారీ నష్టలతో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 2.63, సన్ఫార్మా మాత్రమే లాభాలు గడించాయి. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ 11 పైసలు నష్టపోయి 79.79 వద్ద నిలిచింది. గత సెషన్తో పోలిస్తే 11 పైసలు నష్టపోయింది.