సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సైకిల్ వినియోగానికి జీహెచ్ఎంసీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఆరు జోన్లలో ప్రయోగాత్మకంగా ఈ సైకిల్ ట్రాక్లను సిద్ధం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఖైరతాబాద్ జోన్ పరిధిలోని షేక్పేటలో సైకిల్ ట్రాక్ సిద్ధం కాగా కూకట్పల్లి జోన్లోని నర్సాపూర్ రోడ్డులో మరో సైకిల్ ట్రాక్ ప్రారంభానికి సిద్ధ్దంగా ఉంది. బాలానగర్-నర్సాపూర్ రోడ్లో రహదారికి ఇరువైపులా 500 మీటర్ల చొప్పున కిలోమీటరు మేర అత్యాధునిక ప్రమాణాలతో ట్రాక్ను నిర్మించారు. ట్రాక్ పక్కనే పచ్చని అందాలు, మరో పక్కన వాహనాల రాకపోకల మధ్యన కనువిందు చేసేలా ఈ ట్రాక్ను నిర్మించినట్లు జోనల్ కమిషనర్ మమత తెలిపారు.