తిరువనంతపురం: కరోనా మహమ్మారి కాలంలో దేశంలో సైబర్ నేరాలు 500 శాతం పెరిగాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీవోడీ) జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. 14వ హ్యాకింగ్, సైబర్సెక్యూరిటీ బ్రీఫింగ్ ‘C0c0n’ను కేరళ పోలీసులు నిర్వహించారు. జనరల్ బిపిన్ రావత్ ఆన్లైన్లో ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరాలు బాగా పెరినందున కొత్త ముప్పులపై దృష్టిసారించాల్సి ఉందన్నారు.
డ్రోన్లు, రాన్సంమ్వేర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైజ్లు వంటి కొత్త బెదిరింపులను కేంద్రంతోపాటు రాష్ట్రాలు పరిగణించాలని జనరల్ బిపిన్ రావత్ సూచించారు. వర్చువల్ కరెన్సీలు, బ్లాక్చెయిన్ల వంటి కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ఐటీ చట్టం 2000ని మరింత సవరించాలని తెలిపారు. డేటా ప్రొటెక్షన్ బిల్లు 2019 ఇంకా తుది అంకానికి చేరుకోలేదన్నారు.