న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, మొజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ వినియోగదారులకు సైబర్ దాడుల ముప్పు పొంచి ఉన్నట్టు కేంద్రం హెచ్చరించింది. టార్గెటెడ్ సిస్టంలోకి ఆర్బిట్రరీ కోడ్ను ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారుల డివైజ్లను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తెచ్చుకొనే ప్రమాదం ఉన్నట్టు పేర్కొన్నది. సైబర్ దాడుల బారిన పడకుండా ఉండాలంటే వాట్సాప్ వినియోగదారులు వెంటనే తమ యాప్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. మొజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ వినియోగదారులు తమ వెర్షన్ను 105కు, మొజిల్లా ఫైర్ఫాక్స్ ఈఎస్ఆర్ బ్రౌజర్ వినియోగదారులైతే 102.3 వెర్షన్కు అప్గ్రేడ్ చేసుకోవాలని తెలిపింది.