భారత స్టార్ బాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్.. కామన్వెల్త్ క్రీడల్లో సత్తాచాటలేకపోయాడు. మిక్స్డ్ టీం ఈవెంట్లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో ఓడిపోయాడు. ఈ ఈవెంట్లో కేవలం పీవీ సింధు మాత్రమే మహిళల సింగిల్స్ ఫైనల్ నెగ్గింది. మిగతా విభాగాలన్నింట్లో ఓటమి చవిచూసిన భారత్.. సిల్వర్ మెడల్తో సరిపెట్టుకుంది.
ఈ క్రమంలో ఓటమి తర్వాత శ్రీకాంత్ చాలా బాధపడ్డాడని మరో బాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి తెలిపాడు. ‘‘శ్రీకాంత్ అన్న చాలా బాధపడ్డాడు. అదేమీ తను చేసిన తప్పు కాదు, కానీ తనదే తప్పు అన్నట్లు బాధపడ్డాడు. నేను కూడా నా మ్యాచ్ ఓడిపోయాను. కానీ తను అలా ఏడవడం చూస్తే చాలా బాధేసింది’’ అని సాత్విక్ తెలిపాడు.