కామన్వెల్త్ క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల ట్రిపుల్ జంప్లో బంగారం, వెండి పతకాలు రెండింటినీ భారత క్రీడాకారులే సాధించారు. ఈ క్రీడలో తొలి గోల్డ్ మెడల్ సాధించిన భారతీయుడిగా ఎల్డ్హోస్ పాల్ రికార్డు సృష్టించాడు. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో 25 ఏళ్ల ఈ అథ్లెట్.. 17.03 మీటర్ల బెస్ట్ జంప్తో గోల్డ్ మెడల్ తన ఖాతాలో వేసుకున్నాడు. అదే పోటీలో అబ్దుల్లా అబూబకర్ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ను కూడా భారత్కే అందించాడు.