చెన్నై: త్రివర్ణ పతాకంలోని మూడు రంగులు, అశోక చక్రం ఉన్న కేకును కట్ చేయడాన్ని దేశభక్తి లేకపోవడం లేదా అవమానించడంగా చూడలేమని మద్రాస్ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971 సెక్షన్ 2 ప్రకారం ఇది నేరమే అవుతుందని పిటిషనర్ సెంథిల్కుమార్ వాదించగా.. కోర్టు మాత్రం ఆ వాదనను తోసిపుచ్చింది.
2013లో క్రిస్మస్ సందర్భంగా 6×5 అడుగుల అశోక చక్రం ఉన్న త్రివర్ణ పతాక కేకును కట్ చేయగా.. దానిని 2500 మంది అతిథులు తిన్నారు. ఈ ఈవెంట్కు అప్పటి కోయంబత్తూరు జిల్లా కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇతర రాజకీయ నేతలు హాజరయ్యారు.
ఇది కచ్చితంగా జాతీయ పతాకాన్ని అవమానించడమే అవుతుందని సెంథిల్కుమార్ పిటిషన్ ఫైల్ చేశారు.
Read more: జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషనర్ వాదనను కొట్టేసింది. ఇండియాలోని ప్రజాస్వామ్యంలో జాతీయవాదం చాలా ముఖ్యమే. కానీ దానికి అతిగా కట్టుబడి ఉండటం దేశ శ్రేయస్సుకు మంచిది కాదు. కేవలం కేకు కట్ చేయడం అనేది దేశభక్తి లేకపోవడం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
దేశభక్తి అనేది మానవత్వం కంటే గొప్పది కాదు అన్న ఠాగూర్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. ఆ రోజు ఆ ఈవెంట్కు హాజరైన వాళ్లలో ఎవరూ జాతీయవాదాన్ని అవమానించలేదని కోర్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
పేలిన అగ్నిపర్వతం.. డ్రోన్తో తీసిన అద్భుతమైన వీడియో
అమెజాన్కు షాక్: రిలయన్స్-ఫ్యూచర్కు ఊరట!
మందుబాబులకు గుడ్న్యూస్.. వయసు పరిమితి 21 ఏండ్లే..
ఆ దేశం అమ్మాయిలను వివాహమాడటంపై సౌదీ నిషేధం..!