అమరావతి : కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కర్ఫ్యూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూ రాత్రి 10 గంటల సమయం నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుందని, ఈ నెల 21 తేదీ వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. కర్ఫ్యూకు ప్రజలందరూ సహకరించాలని కోరింది. నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తప్పనిసరిగా అందరు నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా.. నిన్న ఏపీలో కొత్తగా 1,535 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,89,296కు పెరిగింది.