న్యూఢిల్లీ : దేశంలో కరోనాకు వ్యతిరేకంగా టీకా ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 26.86 కోట్ల మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గురువారం రాత్రి 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు మొత్తం 26,86,65,914 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. 18-44 ఏజ్ గ్రూప్లో శనివారం 18,94,803 మందికి తొలి మోతాదు.. 88,017 మందికి సెకండ్ డోసు అందజేసినట్లు చెప్పింది. మూడో దశ టీకా డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి 4,93,56,276 మందికి తొలి, మరో 10,58,514 మందికి రెండో మోతాదు అందజేసినట్లు చెప్పింది. శనివారం నాటికి టీకా డ్రైవ్ 153వ రోజుకు చేరగా.. ఒకే రోజు 29,64,596 డోసులు పంపిణీ చేశారు. ఇందులో 25,81,421 మంది లబ్ధిదారులకు మొదటి.. 3,83,175 మందికి సెకండ్ డోస్ అందజేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.