న్యూఢిల్లీ: కొవిడ్ చికిత్స కోసం ఇప్పటిదాకా సరైన డ్రగ్లేదు. ఇంకా పలురకాల డ్రగ్స్పై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, నిక్లోసమైడ్ అనే ఔషధంపై దేశంలోనే అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ధృవీకరించింది.
“పునర్నిర్మించిన నిక్లోసమైడ్ డ్రగ్పై సీఎస్ఐఆర్ ఇండియా, లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి.” అని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొవిడ్ చికిత్సలో ఈ డ్రగ్ సమర్థత, సేఫ్టీని పరిశీలించేందుకు రెండుదశల్లో బహుళ విధానంతోపాటు ర్యాండమ్, ఓపెన్ లేబుల్ క్లినికల్ అధ్యయనం నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, నిక్లోసమైడ్ డ్రగ్ను పెద్దలు, పిల్లల్లో టేప్వార్మ్ (ఏలికపాములు) సంక్రమణ చికిత్స కోసం విస్తృతంగా ఉపయోగించేవారని పేర్కొంది. ఇది తక్కువ ధరలో లభించే అత్యంత ప్రభావవంతమైన ఔషధమని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మండే తెలిపారు.