హైదరాబాద్ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ ముగింపు ఉత్సవాలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ ముగింపు వేడుకల్లో శంకర్ మహదేవన్, శివమణి లాంటి ప్రముఖుల సంగీత విభావరి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 25 వేల మందికి పైగా పాల్గొంటారని వెల్లడించారు.
ఈ సమావేశంలో అడిషనల్ డీజీ జితేందర్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అడిషనల్ పోలీస్ కమీషనర్ శర్వానంద్ , ట్రాఫిక్ డీసీపీ రంగనాధ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ ఛీప్ గణపతి రెడ్డి, టీఎస్ఐసీసీ ఎండీ నరసింహారెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ బి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.