హైదరాబాద్ : 15వ ఆర్థిక సంఘానికి వైద్య, ఆరోగ్యశాఖ తరఫున పంపే ప్రతిపాదనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత మెరుగైన వైద్య, ఆరోగ్య సదుపాయాలను కల్పించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాలను పటిష్ట పరుచడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొన్నింటిని మండల పబ్లిక్ హెల్త్ యూనిట్గా అభివృద్ధి చేయాలని సూచించారు.
సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, మున్సిపల్ శాఖ కమిషనర్ సత్యనారాయణ, వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, వైద్య, ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు, వైద్య విద్యాశాఖ సంచాలకులు రమేశ్రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.