క్రూజ్ సంస్థ వింత ప్రకటన
న్యూఢిల్లీ, మే 28: ‘మిమ్మల్ని, మీ సరుకులను తీసుకెళ్తున్న మా ఓడ బెర్ముడా ట్రయాంగిల్లో మునిగిపోతుందని భయపడకండి. నౌక మునిగిపోయే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ మునిగిపోతే మీకు, మీ సరుకులకు విలువ గట్టి 100% రిఫండ్ ఇస్తాం’ అని ఏన్సియంట్ మిస్టరీస్ క్రూజ్ అనే సంస్థ వింత ప్రకటన ఇచ్చింది.
ఈ సంస్థకు చెందిన నౌక వచ్చే ఏడాది మార్చిలో న్యూయార్క్ నుంచి బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరికి వెళ్లనుంది. అక్కడికి వెళ్లాలనుకొనే ఔత్సాహికులను అందులో తీసుకువెళ్లనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులను ఆకర్షించడానికి సంస్థ ఈ ప్రకటన చేసింది.