టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలలో పుష్ప చిత్రం ఒకటి. ఈ మూవీ డిసెంబర్ 17న విడుదల కానున్న విషయం తెలిసిందే. చిత్ర ప్రమోషన్లో భాగంగా సమంత ఈ సినిమాలో చేసిన ఊ అంటావా.. ఉఊ అంటావా మావా అనే పాట విడుదల చేశారు. ఈ పాట విడుదల అయినప్పటి నుండి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఈ పాటని కొందరు విమర్శిస్తుండగా, మరి కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా ఈ పాటకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఒక్క పాట కోసం మేకర్స్ దాదాపుగా 5 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. సమంతకు కోటికి పైగా పారితోషికం కట్టబెట్టారట. సినిమాకు తగ్గట్లుగానే ఈ ఐటెం సాంగ్ కూడా ఉంటుందని.. భారీ విజువల్ వండర్ అన్నట్లుగా పాటను చిత్రీకరించారు. కేవలం వారం రోజుల్లోనే ఈ పాటను పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సినిమాపై భారీ అంచనాలే పెంచింది.
ఈ పాట కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్టింగ్ కూడా చాలా భారీగా కనిపిస్తుందని అంటున్నారు. ఇక పాట కోసం డాన్సర్స్.. జూనియర్ ఆర్టిస్టులు, ఇతర సాంకేతిక నిపుణులు , స్టాఫ్ ఇంకా బన్నీ డేట్ల ఖరీదు అంతా కలిస్తే పాట ఖరీదు 5 కోట్ల రూపాయలు అయ్యి ఉంటుందని విశ్లేషకుల అంచనా.ఐటెం సాంగ్ కోసం ఇంత ఖర్చు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ ఐటెం సాంగ్ ను చేసేందుకు సమంత ఎలాంటి పరిమితులు కండీషన్స్ ను పెట్టలేదని బన్నీ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు.