మెండోరా, మే 24 : మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామ చెరువులో చేపల వలకు ఓ మొసలి చిక్కింది. చెరువులో మొసలి ఉన్నట్లు నెలరోజుల క్రితం గుర్తించిన జాలర్లు.. దాన్ని బంధించాలని ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.
మంగళవారం ఎంతో చాకచక్యంగా మత్స్యకారులందరూ కలిసి వేసిన వలకు మొసలి చిక్కడంతో గ్రామస్తులు, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టుకున్న మొసలిని అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు స్థానికులు తెలిపారు.