కోల్కతా: కీలక నేతలంతా పార్టీని వీడి బీజేపీలో చేరుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. బెంగాల్ సీఎం మమతాబెనర్జి సమక్షంలో క్రికెటర్ మనోజ్ తివారి టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మమతాబెనర్జి చిన్సురాహ్ జిల్లాలోని హుగ్లీలో జరిగిన బహిరంగ సభలో ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా క్రికెటర్ మనోజ్ తివారీ టీఎంసీలో చేరాడు.
కాగా, 35 ఏండ్ల మనోజ్ తివారీ ఇప్పటివరకు పశ్చిమబెంగాల్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. బెంగాల్లో చోటా దాదాగా పేరున్న మనోజ్ భారత్ తరఫున కూడా 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైజింగ్ పుణె సూపర్ జియాంట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.