అమరావతి : ఆంధ్రవర్సిటీలో అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలున్న ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పీవీజీడీ ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఏపీ గవర్నర్కు లేఖ రాసారు. ఎక్కడా లేని విధంగా ఏయూలో రీవాల్యుయేషన్ పద్ధతి తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు.
విశ్వవిద్యాలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్న అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయాలకు దూరంగా ఉండవలసిన వైస్ఛాన్సలర్ ఒక రాజకీయపార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం దురదృష్టకరమని అన్నారు. వర్సిటీలో పలు కోర్సులను తొలగించడంతో పాటు తనకు అనుకూలంగా లేని సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.