హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ వ్యవహారం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని ఇప్పటికైనా వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని అని చెప్పడం స్వాగతించదగ్గ విషయం సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకొని ఉంటే ప్రజానీకానికి ఎంత ఉపయోగపడదని అన్నారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రి తర్వాత గుజరాత్, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు ప్రధానికి లేఖలు రాశారని అప్పుడు పట్టించుకోలేదని విమర్శించారు. దీనిపై సిపిఐ సిపిఎం దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరిగిందన్నారు. ఆలస్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అయితే వ్యాక్సిన్ పంపిణీ నిష్పక్షపాతంగా జరగాలని కోరారు. రాష్ట్రాల మధ్య పక్షపాతం లేకుండా సరఫరా చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.