హైదరాబాద్ : ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్ సర్కారు నిరంకుశంగా ప్రవర్తించింది నిజం కాదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన శాంతియుత నిరసనలపై పోలీసులతో ఉక్కుపాదం మోపలేదా? అని నిలదీశారు. పీఆర్సీ, సీపీఎస్ అంశాల్లో ఉద్యోగుల ఆశలపై ఏపీ ప్రభుత్వం నీళ్లు చల్లిందా లేదా? ఉద్యోగులు, ఉపాధ్యాయులను పోలీస్ స్టేషనులకు పిలిపించి వేధించడం, గృహనిర్బంధాలు, వారి కుటుంబ సభ్యులను పలు రకాల వేధింపులకు గురి చేయటం నిజం కాదా? అని, ఆఖరికి టీచర్లను మద్యం షాపుల ముందు నిలబెట్టారా లేదా? అని సూటిగా ప్రశ్నించారు. హరీశ్రావు ఉన్నది చెబితే వైసీపీ నేతలకు ఉలికిపాటెందుకు అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అవలంబించడాన్ని ఖండిస్తున్నామని రామకృష్ణ పేర్కొన్నారు.