Gujarat | నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకుమారుడిపై ఓ ఆవు దాడి చేసింది. ఆ ఆవు దాడి నుంచి తల్లీ తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
గుజరాత్లోని మోర్బి జిల్లా కేంద్రంలోని లక్ష్మీనారాయణ సొసైటీలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఓ మహిళ తన కుమారుడితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. వీరికి కొంచెం దూరంలో ఓ ఆవు ఉంది. అయితే వీరిని చూసిన మరుక్షణమే ఆవు.. తల్లీకుమారుడిపైకి దూసుకొచ్చింది. ఆ పిల్లాడిపై దాడి చేసేందుకు ఆవు యత్నించింది.
అప్రమత్తమైన తల్లి తన ప్రాణాలను ఫణంగా పెట్టి, కుమారుడిని ప్రాణాలను కాపాడుకుంది. ఆవు కాసేపు తల్లీకుమారుడిపై దాడి చేసినప్పటికీ.. సదరు మహిళ వీరోచిత పోరాటం చేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని, ఆవును బెదిరించి వెళ్లగొట్టారు. తల్లీకుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
મોરબીના સામાંકાંઠે રખડતી રંઝાડનો આતંક
માતા સાથે જતા બાળક પાછળ ગાય પડી
માતા-પુત્રને ગાયે ચગદી નાખવા માટે ઢીકે ચડાવી
સીસીટીવી વીડિયો આવ્યો સામે #viralvideo pic.twitter.com/b56BMX6Wi1— News18Gujarati (@News18Guj) October 21, 2022