న్యూఢిల్లీ: ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ కొత్త సర్వే రిపోర్ట్ను రిలీజ్ చేసింది. కోవిడ్ వేళ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకవచ్చినట్లు ఆక్స్ఫామ్ తన నివేదికలో వెల్లడించింది. ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్ అన్న టైటిల్తో ఆ నివేదికను ఆ సంస్థ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ప్రతి 33 గంటలకు సుమారు పది లక్షల మంది తీవ్రమైన పేదరికంలోకి నెట్టబడినట్లు ఆ రిపోర్ట్లో ఆక్స్ఫామ్ తెలిపింది. దావోస్లో వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సు నేపథ్యంలో ఆక్స్ఫామ్ ఈ నివేదికను రిలీజ్ చేసింది. ఆక్స్ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గ్యాబ్రియేలా బుచర్ ఈ రిపోర్ట్ను వెల్లడించారు. దశాబ్ధాలుగా పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన చర్యలన్నీ ఇప్పుడు రివర్స్లో వెళ్తున్నట్లు బుచర్ ఆరోపించారు. లక్షలాది మంది ప్రజలు రోజువారి జీవితం సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని, అత్యధిక స్థాయిలో నిత్యావసరాల ధరలు పెరిగినట్లు పేర్కొన్నారు.
For every one billionaire minted since the pandemic began, 1M more people could be pushed into extreme poverty in 2022. While the world is reeling from multiple crises, the world’s wealthiest are unashamedly #ProfitingFromPain of ordinary people🧑🏭Morehttps://t.co/47FyVW5b0U pic.twitter.com/rRlKAFv1Nj
— Oxfam International (@Oxfam) May 23, 2022
2020 సంవత్సరంలో బిలియనీర్ల సంఖ్య 573 నుంచి 2700 వరకు పెరిగినట్లు ఆక్స్ఫామ్ తెలిపింది. ఆ కుబేరుల సంపద 3.8 ట్రిలియన్ల డాలర్ల నుంచి 12.7 ట్రిలియన్ల డాలర్లకు పెరిగినట్లు రిపోర్ట్లో తెలిపారు. ఫుడ్, ఎనర్జీ సెక్టార్లో ఉన్నవారి ఆదాయం అమాంతంగా పెరిగినట్లు చెప్పారు. గడిచిన 23 ఏళ్లతో పోలిస్తే కోవిడ్ సమయంలో తొలి 24 నెలల్లోనే బిలియనీర్ల సంపద అధికంగా పెరిగినట్లు రిపోర్ట్లో తెలిపారు. గ్లోబల్ జీడీపీలో బిలియనీర్ల సంపద 13.9 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రైవేటీకరణ, మోనోపలీ పేరుతో ధనికులు మరింత ధనవంతులుగా మారారన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో బిలియనీర్ల ఆస్తులు పెరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఇక మరో వైపు లక్షలాది మంది తిండికి లేక ఇబ్బందిపడుతున్నారు. ఈస్ట్ ఆఫ్రికాలో ప్రతి నిమిషానికి ఒక ఆకలి చావు నమోదు అవుతుంది. అసమానతలే ప్రజల్ని పీడిస్తున్నట్లు తెలిపారు 300 కోట్ల మంది దగ్గర ఎంత సంపద ఉందో, ప్రపంచంలోని తొలి పది మంది సంపన్నుల్లో అంతే నగదు ఉందని అన్నారు.