హైదరాబాద్ : రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉచితంగా కొవిడ్ టీకాలు వేయాలని టీఎన్జీవో విజ్ఞప్తి చేసింది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగితో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఉచితంగా టీకాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ టీఎన్జీవో కేంద్ర సంఘం పక్షాన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీఎన్జీవో రాష్ట్ర సంఘ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులందరికీ టీకా ఇచ్చారు. ఇక మిగతా ఉద్యోగులకు కూడా టీకాను ఉచితంగా ఇవ్వాలని కోరారు.