న్యూఢిల్లీ : కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మద్దతుగా రాబోయే మూడు అదనంగా 60లక్షల వ్యాక్సిన్ మోతాదులు అందజేయనున్నట్లు కేంద్రం సోమవారం తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 16.4 కోట్ల కొవిడ్ మోతాదులు అందించినట్లు పేర్కొంది. సోమవారం ఉదయం 8 గంటల వరకు అందిన నివేదిక ప్రకారం.. వృథాతో సహా 15,79,21,537 వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపింది. 75లక్షలకుపైగా టీకాలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఇంకా 60లక్షల వరకు వ్యాక్సిన్ మోతాదులు రాబోయే మూడు రోజుల్లో అందుకుంటాయని పేర్కొంది. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 15,71,98,207 డోసులను లబ్ధిదారులకు వేసినట్లు వివరించింది.