ఎర్రగడ్డ: కరోనా కట్టడికి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ నేతాజీనగర్లో కొనసాగుతున్న కొవిడ్ టీకా పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే గోపీనాథ్ శనివారం పరిశీలించారు.
ప్రభుత్వ సూచనల మేరకు అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారని అన్నారు. ప్రతిఒక్కరూ టీకాను తీసుకోవాలని సూచించారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా స్థానిక సంక్షేమ సంఘాలు, పార్టీ శ్రేణులు చొరవ చూపాలని కోరారు.