హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్లో జంతువులకు కరోనా సోకుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవలే గుజరాత్ గిర్ సంరక్షణ కేంద్రంలోని సింహాలకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మనుషుల నుంచి జంతువులకు కరోనా వ్యాప్తిపై పరిశోధనలు ముమ్మరమయ్యాయి. తాజాగా హైదరాబాద్ నెహ్రూ జూపార్క్లోని 8 సింహాలకు కోవిడ్ లక్షణాలు కనిపించాయి. ఆ 8 సింహాల శాంపిల్స్ను జూ అధికారులు సీసీఎంబీ పరీక్షల నిమిత్తం పంపించారు. మంగళవారం రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జూపార్క్లోకి సందర్శకుల ప్రవేశాలు నిలిపివేశారు.