(Covid self test) ఇకపై ఇంట్లోనే కూర్చుని ఇకపై కరోనా వైరస్ను పరీక్షించుకోవచ్చు. కరోనా టెస్ట్ కిట్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో వచ్చాయి. ప్రస్తుతం పెరుగుతున్న ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ దృష్ట్యా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు.. ఈ కిట్ల ఉపయోగం, ఖచ్చితత్వం గురించి చర్చిస్తున్నారు. ఈ కిట్ ద్వారా బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కూర్చున్న ప్రాంతం నుంచే కొవిడ్ సోకిందీ లేనిదీ ఈ కిట్తో తెల్సుకునే వీలుంటుంది.
కరోనా పరీక్షను చేసుకునేందుకు వేగవంతమైన యాంటిజెన్ లేదా ఆర్టీ పీసీఆర్ లేదా ఇతర పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఈ పరీక్షలు చేయాలంటే వైద్య నిపుణులు, ల్యాబ్లు అవసరమవుతాయి. అయితే, ఇంట్లోనే కరోనా పరీక్ష అనేది సులభమైన ఎంపిక. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ వంటి కిట్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీనిలో శాంపిల్ను పెట్టడం ద్వారా 15 నుంచి 20 నిమిషాల్లో కరోనా వైరస్ను గుర్తించవచ్చు. ఈ టెస్ట్ కిట్ ద్వారా ఎవరి సాయం లేకుండానే సొంతంగా పరీక్షించుకునే వెసులుబాటు ఉన్నది. ఇవి మార్కెట్లో రూ.250-500 రేంజ్లో లభిస్తున్నాయి.
ఆర్టీ పీసీఆర్ పరీక్షను ప్రమాణ పరీక్షగా భారత ప్రభుత్వం పరిగణిస్తున్నది. ఈ పరీక్షలో రోగి ముక్కు లేదా గొంతు నుంచి నమూనా తీసుకుంటారు. ఈ పరీక్షకు ల్యాబ్లో 4-5 గంటల సమయం తీసుకుంటుంది. నమూనా జన్యు శ్రేణి కరోనా వైరస్ జన్యు శ్రేణికి సరిపోలితే.. రోగిని కొవిడ్ పాజిటివ్గా పరిగణిస్తారు. ఈ రెండు పరీక్షలు కరోనా వైరస్ అసలు జాతిని గుర్తించడంలో ప్రభావవంతంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇంట్లో చేసుకునే సెల్ఫ్ టెస్టుల ద్వారా ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించలేమని నిపుణులు చెప్తున్నారు.
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
రిలాక్స్ కోసం కాఫీ తాగుతున్నారా? ఒక్క క్షణం ఆలోచించండి
ప్రతినెలా రూ.1500 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ. 35 లక్షలు…
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..