టెహ్రాన్: ఇరాన్లో కోవిడ్ మృతుల ( Covid Deaths ) సంఖ్య అధికారికంగా లక్ష దాటింది. ఆ దేశ ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని గురువారం వెల్లడించింది. మరోవైపు కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 31,266 మందికి వైరస్ సంక్రమించగా.. 564 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదు అయిన కేసుల సంఖ్య 4,587,683 కాగా, మరణాల సంఖ్య 100255కు చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. జూన్ నుంచి ఇరాన్లో అయిదో దశ ఇన్ఫెక్షన్లు మొదలైనట్లు తెలుస్తోంది. డెల్టా వేరియంట్ వల్ల ఆ కేసులు నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు.