గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యేకంగా కొవిడ్ కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులపై భారం తగ్గించడంతో పాటు కొవిడ్ పాజిటివ్ రోగుల ఐసొలేషన్ కోసం ప్రత్యేకంగా ఈ కేంద్రాలను వినియోగించేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు ముందుగా ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చనే దానిపై సర్వే నిర్వహించినట్లు సమాచారం. ముందుగా సమగ్ర సమాచారాన్ని సేకరించిన తర్వాత అవసరాన్ని బట్టి కొవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.