న్యూఢిల్లీ: కరోనానే కాదు దానిని అడ్డుకునేందుకు చేపడుతున్న చర్యలు కూడా ఇప్పుడు దేశానికి కొత్త సవాలును విసురుతున్నాయి. కరోనా టెస్టులు, చికిత్స, క్వారంటైన్ల వంటి చర్యల కారణంగా దేశంలో రోజుకు 146 టన్నుల కొవిడ్ వ్యర్థాలు ఉత్పత్తవుతున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో పార్లమెంట్కు వెల్లడించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వచ్చిన ప్రశ్నకు ఆయన స్పందించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల మేరకు ప్రతి రోజూ 146 టన్నుల బయో మెడికల్ వేస్ట్ జనరేట్ అవుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కొవిడ్ బయో మెడికల్ వ్యర్థాలను సురక్షితంగా పారవేస్తున్నట్లు తెలిపారు. వీటి కోసం ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగిన ఏర్పాట్లు చేయాలని కూడా మంత్రి కోరారు.