ముజఫర్నగర్ : కరోనా కేసుల పెరుగుదలతో ఉత్తరప్రదేశ్లోని మరోనగరంలో అధికారులు రాత్రి కర్ఫ్యూ అమలులోకి తీసుకువచ్చారు. ముజఫర్నగర్లో నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని జిల్లా మేజిస్ట్రేట్ సెల్వా కుమారి తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజల కదలికలపై నిషేధాజ్ఞలుంటాయని, అవసరమైన సేవలకు సంబంధించి మినహాయింపు ఉంటుందని చెప్పారు. ముజఫర్నగర్లో శుక్రవారం 134 మంది వైరస్ పాజిటివ్గా పరీక్షించగా.. మొత్తం 9,522 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. 115 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే 8న వారణాసి, కాన్పూర్, లక్నో, ప్రయాగ్రాజ్లో అమలులో ఉంది. పెరుగుతున్న కరోనా కేసులతో అధికారులు వైరస్ కట్టడికి చర్యలు చేపడుతున్నారు.